దేశం కోసం పూజలు చేయండి: పురంధేశ్వరి పిలుపు

by srinivas |
దేశం కోసం పూజలు చేయండి: పురంధేశ్వరి పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: దేశం కోసం పూజలు చేయండని బీజేపీ నేతలకు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి(Ap Bjp Chief Purandeswari) పిలుపునిచ్చారు. పాకిస్థాన్ ఉగ్రవాదులు(Pakistan Terrorits), ఆర్మీ(Army) చేస్తున్న దాడులను భారత సైనికులు(Bharat Syniks) తిప్పికొడుతున్నారు. దీంతో భారత జవాన్లకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని, అలాగే వాళ్లలో మనో ధైర్యం నింపేందుకు మద్దతుగా నిలవాలని, ఇందుకు పూజలు చేయాలని ఆమె పేర్కొన్నారు. పాక్‌తో పోరాడుతున్న భారత సైన్యం, ప్రధాని మోడీ(Pm Modi), దేశం కోసం రాష్ట్రంలోని అన్ని ప్రార్థనా మందిరాల్లో రెండు రోజుల పాటు పూజలు నిర్వహించాలని సూచించారు. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశం సురక్షితంగా ఉండాలని ప్రార్థనలు చేయాలని పురంధేశ్వరి పేర్కొన్నారు.



Next Story

Most Viewed