ప్రత్యేక పూజలు చేస్తున్న తమన్న.. ఇలా మారిపోయిందేంటి?

by Dishanational2 |
ప్రత్యేక పూజలు చేస్తున్న తమన్న.. ఇలా మారిపోయిందేంటి?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్న ఈ మధ్యకాలంలో వరుస చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంత విజయం దక్కలేదు. ఇక తాజాగా ఈ అమ్మడు హిమాలయాలకు వెళ్లి అక్కడ ప్రసిద్ధి చెందిన వైష్ణవి దేవి ఆలయంలో పూజలు నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఆమె కాషాయ రంగు దుస్తులతో మెరిసింది. అక్కడ లింగ భైరవి దేవిని దర్శించుకున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. 'ఈ యోగాశ్రమం నుంచి ఆహ్వానం రావడం సంతోషంగా ఉంది . లింగ భైరవి దేవిని దర్శించుకోవడం మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తోంది. జీవితంలో భయం, అపజయాల గురించి ఆందోళన దూరమవుతుంది. లింగ భైరవి విగ్రహాన్ని ఇంటికి తీసుకెళ్లాలి అనిపిస్తుంది' అంటూ వీడియోలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి : నెపోటిజంపై షాకింగ్ కామెంట్స్ చేసిన జాన్వీ!


Next Story