Nellore: యానాదుల సంక్షేమంపై నారా లోకేశ్ కీలక ప్రకటన

by Disha Web Desk 16 |
Nellore: యానాదుల సంక్షేమంపై నారా లోకేశ్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: యానాదుల సంక్షేమంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీల వర్షం కురిపించారు. నెల్లూరు జిల్లా కలవాయి మండలంలో ఆయన యువగళం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా యానాదుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ భూములును ప్రభుత్వం తీసుకుందని లోకేశ్ ఎదుట యానాదులు వాపోయారు. చలించి పోయిన నారా లోకేశ్ వారికి కీలక హామీలు ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యానాదులకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామని చెప్పారు. వైసీపీ తీసుకున్న భూములను తిరిగి ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. అధికారింలోకి వచ్చిన 100 రోజుల్లో రోడ్లు కూడా వేస్తామని నారా లోకేశ్ పేర్కొన్నారు.

Next Story