- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > ఏపీ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Nellore: ప్రభుత్వం చెప్పేది కొండంత చేసేది గోరంత: జనసేన నేత కిషోర్
Nellore: ప్రభుత్వం చెప్పేది కొండంత చేసేది గోరంత: జనసేన నేత కిషోర్
by Vemula.Srinu Prasad |
వైసీపీ ప్రభుత్వం చెప్పేది కొండంత అని.. చేసేది గోరంత అని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ విమర్శించారు....

X
దిశ, నెల్లూరు: వైసీపీ ప్రభుత్వం చెప్పేది కొండంత అని.. చేసేది గోరంత అని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాలన్న చుక్కల భూమిని ఉద్ధరిస్తున్నట్టు, రైతుల కష్టాలు తనకు తెలిసినట్లు సీఎం జగన్ ప్రగల్బాలు పలికారని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 72112.46 ఎకరాల్లో చుక్కల భూములు ఉన్నాయని, ప్రభుత జీవోను అనుసరించి 43270 భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించారన్నారు. క్షేత్రస్థాయిలో రికార్డులు పరిశీలిస్తే కేవలం 112 సర్వే నెంబర్ల భూములు మాత్రమే ప్రభుత్వం తొలగించిందని తెలిసిందన్నారు. ఈ విషయంపై కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చామని కిషోర్ పేర్కొన్నారు.
Next Story






