- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Kavali: ఏసీబీ వలలో అవినీతి అధికారి
by Disha Web Desk 16 |
X
దిశ, నెల్లూరు సిటీ: నెల్లూరు జిల్లా కావలి పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయంపై సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. బాధితుల నుంచి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గుడ్లూరు మండలానికి చెందిన మాధవరెడ్డి కొన్ని పనులు చేశారు. ఆ పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. బిల్లుల కోసం ఆయన కావలి పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయం చుట్టూ తిరిగారు.
ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న మనోజ్ కుమార్ రూ. 27 వేలు లంచం ఇస్తే బిల్లులు చెల్లిస్తామంటూ బేరంపెట్టారు. అసలే బిల్లులు ఆలస్యమై ఇబ్బందుల్లో ఉన్న మాధవరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం బాధితుడు మాధవరెడ్డి జూనియర్ అసిస్టెంట్ మనోజ్ కుమార్కు రూ. 27 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Next Story