వైసీపీ నేతలకు హైకోర్టులో ఊరట!

by Ajay Maddhiboyina |

వైసీపీ నేత‌లు కొడాలి నాని, తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి, త‌లశిల ర‌ఘురాం, లేళ్ల అప్పిరెడ్డిల‌కు హైకోర్టులో ఊర‌ట ద‌క్కింది. వైసీపీ నేత‌ల‌కు సంబంధించిన వేరు వేరు కేసుల్లో

వైసీపీ నేతలకు హైకోర్టులో ఊరట!
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత‌లు కొడాలి నాని, తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి, త‌లశిల ర‌ఘురాం, లేళ్ల అప్పిరెడ్డిల‌కు హైకోర్టులో ఊర‌ట ద‌క్కింది. వైసీపీ నేత‌ల‌కు సంబంధించిన వేరు వేరు కేసుల్లో నేడు న్యాయ‌స్థానంలో విచార‌ణ జ‌రిగింది. పోలీసుల‌పై కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్య‌ల కేసులో త‌దుప‌రి చ‌ర్య‌ల‌పై కోర్టు స్టే విధించింది. అంతే కాకుండా వైస్ జ‌గ‌న్ స‌త్య‌సాయి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో పోలీసుల విధుల‌కు ఆటంకం క‌లిగించార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డిపై తొంద‌ర‌పాటు చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి ఉల్లంఘించిన కేసులో త‌ల‌శిల ర‌ఘురాం, లేళ్ల అప్పిరెడ్డిపై సైతం చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దు అంటూ కోర్టు స్టే విధించింది.

Next Story