రేపు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

by Disha Web Desk 9 |
రేపు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: రానున్న 24 గంటల్లో వర్షాలు దంచికొట్టనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ద్రోణి ప్రభావంతో రేపు (మే 7) ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షం కురవనుందని వెల్లడించింది. ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతరపురం, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, అల్లూరి, మన్యం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు కురవనున్నాయని వెల్లడించింది. కాగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఓ రకంగా ప్రజలకు ఊరట కలగనుందని చెప్పుకోవచ్చు.

Next Story

Most Viewed