పుట్టపర్తి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

by Thanuru Gopichand |   (  Updated:2025-11-22 06:21:40  IST  )

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు.

పుట్టపర్తి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
X

దిశ, వెబ్ డెస్క్ : భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో బయలుదేరి రాష్ట్రపతి పుట్టపర్తికి చేరుకున్నారు. పుట్టపర్తిలో జరుగుతున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతోత్సవాలలో రాష్ట్రపతితో కలిసి సీఎం, ఇతర మంత్రులు పాల్గొననున్నారు. ప్రముఖుల రాకతో పుట్టపర్తి అంతటా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. కాన్వాయ్ లు వెళ్తే మార్గంలో పటిష్ట నిఘాను ఉంచారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలను తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Next Story