Breaking: ఎయిర్ ఇండియా విమానంలో తనిఖీలు

by Vemula.Srinu Prasad |

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమానంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు....

Breaking: ఎయిర్ ఇండియా విమానంలో తనిఖీలు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ ఎయిర్ పోర్టు(Hyderabad Airport)లో ఎయిర్ ఇండియా విమానం(Air India Flight)లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీ(Delhi) నుంచి వచ్చిన వెంటనే ప్రయాణికుల(Passengers)ను దింపి సోదాలు(Search) చేస్తున్నారు. ఈ కారణంతో తిరుపతి(Tirupati) వెళ్లాల్సిన విమానం ఆలస్యం అవుతోంది. విమానం 1.15కు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సి ఉంది. తనిఖీల నేపథ్యంలో గంటల ఆలస్యంగా ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం విమానంలో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీలు అనంతరం విమానం తిరుపతి బయల్దేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. గంటపాటు విమానం ఆలస్యం కావడంపై మండిపడ్డారు.

Next Story