AP Politics: గుంటూరు తూర్పు టీడీపీలోకి కొత్త అభ్యర్థి.. ఎవరంటే..?

by Disha Web Desk 3 |
AP Politics: గుంటూరు తూర్పు టీడీపీలోకి కొత్త అభ్యర్థి.. ఎవరంటే..?
X

దిశ ప్రతినిధి.గుంటూరు: జిల్లా కేంద్రం గుంటూరు నగరంలో ఉన్న గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీలోకి కొత్త అభ్యర్థిని ఎంపిక చేసే ఆలోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. తూర్పు టీడీపీ అభ్యర్థిగా నసీర్ అహమ్మద్‌ను పార్టీ అధిష్టానం 2వ జాబితాలో ఖరారు చేసింది. ఐతే నసీర్ అహమ్మద్ పరిస్థితి నియోజకవర్గంలో ఆశాజనకంగా లేదని సర్వే బృందాలు నివేదికలు ఇచ్చినట్టు తెలుస్తోంది.

దీంతో చంద్ర బాబు, లోకేష్ తూర్పు నియోజకవర్గం టీడీపీ వ్యవహారాలపై దృష్టి సారించినట్లు సమాచారం. నశీర్ కంటే దీటైన అభ్యర్థి కోసం పార్టీ అన్వేషిస్తున్నట్టు సమాచారం. దీనితోపాటు నియోజకవర్గంలో ప్రస్తుతం పార్టీ పరిస్థితిపై అభిప్రాయాలు సేకరించినట్లు సమాచారం. మొత్తం మీద తూర్పు నియోజకవర్గం టీడీపీ వ్యవహారాల్లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.


Next Story

Most Viewed