ఆ మంత్రులకు భయం ఎలా ఉంటుందో పరిచయం చేస్తా: నారా లోకేశ్

by Disha Web Desk 21 |
ఆ మంత్రులకు భయం ఎలా ఉంటుందో పరిచయం చేస్తా: నారా లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గొప్పతనం ఈ ప్రపంచానికి మెుత్తం తెలుసునని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గ్రామ స్థాయి నుండి మొదలు పెట్టి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో కూడా చంద్రబాబుకి మద్దతుగా ఉద్యమాలు జరిగాయంటే అది ఆయన గొప్పతనం అని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, దేశంలో ఉన్న అనేక నేతలు చంద్రబాబుకి మద్దతు ఇచ్చారు అని లోకేశ్ చెప్పుకొచ్చారు. ‘చంద్రబాబు కుటుంబం, కుటుంబ సభ్యుల కంటే ఎక్కువుగా ప్రజల్ని ప్రేమించారు. ఆయనకి అండగా నిలబడటమే కాకుండా ఆయన చేసిన గొప్ప పనులు ఇప్పటి యువతకు తెలిసేలా చేసారు. ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యి నిజాన్ని గెలిపించిన అందరికీ ధన్యవాదాలు. ఏ తప్పూ చేయని మమ్మల్నే కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితి వస్తే 38 కేసులు, 43 వేల కోట్ల ప్రజాధనం దొబ్బిన పిచ్చోడిని ఎం చెయ్యాలి. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్ మాఫియా డాన్‌గా మారిన పిచ్చోడు మూడు నెలల్లో పర్మినెంట్‌గా జైలుకి పోవడం ఖాయం. ఈ వైసీపీ నేతలు ఎక్కడికి పోతారు, మంత్రులు ఎక్కడికి పోతారు రేపు అవినీతి కి పాల్పడిన టోటల్ వైసీపీ ఇన్ జైల్. జైలర్ ఎవరో తెలుసా... చంద్రబాబు. మీ తాట తీస్తారు. ఇది ఖాయం రాసిపెట్టుకోండి. చలి కాలంలో ఫ్యాన్ కి ఉక్కపోత మొదలైంది. మూడు నెలల్లో ఫ్యాన్ మాడిపోవడం ఖాయం’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు.

వ్యవస్థలను నాశనం చేసిన జగన్

స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ‘స్కిల్ కేసు లో ముందు 3 వేల కోట్ల అవినీతి అన్నారు, ఆ తరువాత తూచ్ 370 కోట్లే అన్నారు, ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు. అవి కూడా పార్టీ అకౌంట్‌లోకి వచ్చాయి అంటున్నారు. హైకోర్టులో నిజం గెలిచింది.బెయిల్ ఇస్తూ ఇచ్చిన ఆర్డర్ కాపీ చదివిన ఎవరికైనా జగన్ వ్యవస్థల్ని ఎలా నాశనం చేశాడో అర్థమైంది. తప్పు చేస్తే చంద్రబాబు నన్ను వదిలిపెట్టరు’ అని నారా లోకేశ్ తెలిపారు. ఆఖరికి మా అమ్మ భువనమ్మ, నా భార్య బ్రాహ్మణి పై కూడా కేసులు పెడతాం అరెస్ట్ చేస్తాం అని మంత్రులు మాట్లాడారు. ఆ మంత్రులకు భయం పరిచయం చేసే బాధ్యత నాది. రాజారెడ్డి రాజ్యాంగం పనైపోయింది... అంబేద్కర్ రాజ్యాంగం కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. 80 ఏళ్ల కార్యకర్త కూడా బెదిరింపులకు భయపడకుండా తొడకొట్టి సవాల్ చేస్తారు. దట్ ఈజ్ టీడీపీ పవర్. మూడు నెలలు ఓపిక పట్టండి టీడీపీ కార్యకర్తల్ని వేధించిన వైసీపీ వారికి వడ్డీతో సహా చెల్లిస్తా. రాజోలు లో ఉన్నా రష్యా పారిపోయినా తీసుకొచ్చి లోపలేస్తా’ అని నారా లోకేశ్ తెలిపారు.

Next Story