అడ్డుకోవాలని చూశారు.. అయినా ఆగలేదు: ఎంపీ అవినాశ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-09 16:54:22  IST  )

వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా పర్యటన విజయవంతమైందని ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు....

అడ్డుకోవాలని చూశారు.. అయినా ఆగలేదు: ఎంపీ అవినాశ్
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్(Ys Jagan) చిత్తూరు జిల్లా(Chittoor) పర్యటన విజయవంతమైందని ఎంపీ అవినాశ్ రెడ్డి(Mp Avinash Reddy) అన్నారు. మామిడి రైతులను జగన్ పరామర్శించిన సందర్భంగా తలెత్తిన ఘటనపై ఆయన స్పందించారు. జగన్‌(Jagan) పర్యటనను అడ్డుకోవాలని ప్రభుత్వం చూసిందని, మామిడి రైతుల(Mamidi Raithulu)ను రాకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. అంతమంది బలగాలు వచ్చినా ప్రజలు, రైతులు ఆగలేదన్నారు. టీడీపీ(Tdp) శ్రేణులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఎద్దేవా చేశారు. జగన్‌ను మరోసారి సీఎంను చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎంపీ అవినాశ్ పేర్కొన్నారు.

Next Story