టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో బాలకృష్ణ భేటీ.. ఎన్నికల ప్రచారంపై దిశా నిర్దేశం

by Disha Web Desk 16 |
టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో బాలకృష్ణ భేటీ.. ఎన్నికల ప్రచారంపై దిశా నిర్దేశం
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ అయ్యారు. ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో వారితో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారంపై దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజల కోసం ఎన్డీఏ కూటమిలో చేరడం జరిగిందన్నారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురంలో ఎన్డీఏ కూటమి జెండా రెపరెపలాడాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క ఓటరు తమ విలువైన ఓటును అభివృద్ధిపరిచే కూటమికి అభ్యర్థికే వేయాలని కోరారు. హిందూపురంలో గెలుపు లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ ఆగడాలకు ఏపీ ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రతి ఓటరు ఆలోచించి ఓటు వేస్తే వైసిపి ప్రభుత్వం ఇంటికి వెళ్లక తప్పదని బాలకృష్ణ తెలిపారు.



Next Story

Most Viewed