- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఏపీ రాజకీయాల్లోకి మరో జ్యోతిష్యుడు..ఎవరు చెప్పింది నిజం కాబోతుంది?
దిశ,వెబ్డెస్క్: ప్రజెంట్ ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. పార్టీల నేతలు నువ్వా నేనా అనే విధంగా పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఎప్పుడు లేని విధంగా ఏపీ ఎన్నికల ప్రభావం సినీ పరిశ్రమపై కూడా పడిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది సినీ యాక్టర్స్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతుగా ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో జనసేనాని గెలుపు ఖాయమని పవన్ కళ్యాణ్ అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రముఖ జ్యోతిష్యులు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.
వివరాల్లోకి వెళితే..ఎన్నికల వేళ అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ప్రజా సమస్యలు, పరిష్కారాలు, మేనిఫెస్టోలతో పాటు జ్యోతిష్యులు చెప్పే విషయాలు కూడా ప్రభావిత అంశాలుగా మారుతున్నాయి. ఇక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమిగా ఏర్పడిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల గురించి ప్రముఖ జ్యోతిష్యుడు చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఏపీ విషయానికొస్తే ఈ సారి కూటమికి విజయావకాశాలు ఎక్కువని ప్రముఖ ఆస్ట్రాలజర్ విజయేంద్ర మన్యం చెబుతున్నారు. గ్రహాల కదలికలను బట్టి 140కి పైగా స్థానాలు త్రయం సొంతం కావచ్చన్నారు. ఈ క్రమంలోనే అటు సీఎం జగన్ గురించి మరో జ్యోతిష్యుడు చెప్పిన విషయాలు చూస్తే వైసీపీ అభిమానులు గెలుపు తమదే అంటున్నారు. జగన్ గురించి శ్రీధర్ స్వామి మరోసారి సీఎం అవుతారని అంచనాలు ఉన్నాయని తెలిపారు. మరి ఎవరి అంచనాలు నిజం అవుతాయో జూన్ 4న తేలిపోనుంది. ప్రజెంట్ వీరిద్దరి అంచనాలు నెట్టింట వైరల్గా మారాయి.