ఆ వివరాలు బయటపెట్టు.. లేదంటే సారీ చెప్పు: జగన్‌‌కు సత్యకుమార్ సంచలన సవాల్

by Vemula.Srinu Prasad |

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మంత్రి సత్యకుమార్ సంచలన సవాల్ విసిరారు.

ఆ వివరాలు బయటపెట్టు.. లేదంటే సారీ చెప్పు: జగన్‌‌కు సత్యకుమార్ సంచలన సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Former Chief Minister Jagan Mohan Reddy) అన్ని అబద్దాలు చెబుతున్నారని మంత్రి సత్యకుమార్(Minister Satyakumar) ఆరోపించారు. గత ప్రభుత్వంలో వైద్యశాఖలో 52 వేలు రిక్రూట్ మెంట్లు చేపట్టినట్లు జగన్ చెబుతున్నారని, ఆ వివరాలు బయట పెట్టాలని సవాల్ విసిరారు. అలా చేయని పక్షంలో జగన్ క్షమాపణలు చెప్పాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ జీరో వేకెన్సీ విధానంపై జగన్ మరోసారి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. తాను నిర్వహించిన సమీక్షలో మెడికల్ కాలేజీల్లో 2 వేల అధ్యాపకుల కొరత ఉందని తేలిందని చెప్పారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత 4 శాతమే ఉందని జగన్ చెబుతున్నారని, అది పచ్చి అబద్ధమన్నారు. 59 శాతం డాక్టర్ల కొరత ఉందని స్పష్టం చేశారు. ఇలాంటి అబద్ధాలతో ప్రజలను నిందించే బదులు జగన్ తన అసహాన్ని, నిరాశ, భ్రమలను అధిగమించే ప్రయత్నం చేయాలని సత్యకుమార్ సూచించారు.

Next Story