Pawan Kalyan కు మంత్రి రోజా స్ట్రాంగ్ వార్నింగ్

by Disha Web Desk 16 |
Pawan Kalyan కు మంత్రి రోజా స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై మంగళగిరిలో పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడని హెచ్చరించారు. పవన్‌ను చంద్రబాబు ఫూల్‌ను చేస్తున్నారని రోజా ఆరోపించారు. ఉనికి కోసమే పవన్ పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే 175 స్థానాల్లో జనసేన అభ్యర్థుల్ని పోటీ చేయించాలని సవాల్ విసిరారు. పిచ్చి పిచ్చి మాట్లాడేవాళ్లకు ప్రజలు ఓట్లు వేయరన్నారు. అందుకే గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారని రోజా విమర్శించారు.

Next Story

Most Viewed