క్రమశిక్షణ కలిగిన అభ్యర్థులే పోలీస్ శాఖలో ప్రవేశించాలి: కృష్ణా జిల్లా ఎస్పీ

by Dishanational1 |
క్రమశిక్షణ కలిగిన అభ్యర్థులే పోలీస్ శాఖలో ప్రవేశించాలి: కృష్ణా జిల్లా ఎస్పీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కానిస్టేబుల్‌ పరీక్ష రాసిన అభ్యర్థులు తలపెట్టిన సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి చట్ట వ్యతిరేకమని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడేదిలేదని అన్నారు. శనివారం ఎస్పీ పీ జాషువా మీడియాతో మాట్లాడుతూ.. క్రమశిక్షణతో పోలీస్‌ శాఖలోకి ప్రవేశించాలనుకునే అభ్యర్థులు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సరికాదని హితవు పలికారు. అభ్యర్థులు ఒత్తిడులకు లోనై, నిరసన కార్యక్రమాలలో పాల్గొంటే అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులతోపాటు, కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జాషువా హెచ్చరించారు.



Next Story

Most Viewed