Tragedy: చెరువులో పడి ముగ్గురు మృతి

by Disha Web Desk 16 |
Tragedy: చెరువులో పడి ముగ్గురు మృతి
X

దిశ, ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మండల పరిధి సిరాలదొడ్డిలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లిన బంధువులు బట్టలు ఉతికేందుకు గ్రామంలోని చెరువు దగ్గరికి వెళ్లారు. అక్కడ బట్టలు ఉతుకుతున్న సమయంలో లక్కీ(లోకేష్) అనే ఐదు సంవత్సరాల బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో పడ్డాడు. అయితే బాలుడి కాపాడేందుకు ఇద్దరు మహిళలు చెరువులో దూకారు. అయితే వారికి ఈత రాకపోవడంతో ముగ్గురు నీటిలో మునిగిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సలోని(25), మరియమ్మ (28), లోకేష్ (5)గా గుర్తించారు. ఈ ఘటనతో పెళ్లికి హాజరైన బంధువుల దుఃఖరోదనులతో పెళ్లి ఇల్లు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయింది. మృతదేహాలను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు, దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed