Kurnool: బడి ఆక్రమిత స్థలం పట్టాను రద్దు చేయాలి

by Disha Web Desk 16 |
Kurnool: బడి ఆక్రమిత స్థలం పట్టాను రద్దు చేయాలి
X

దిశ, కర్నూలు అర్బన్ : కర్నూలు 43వ వార్డు ఇందిరాగాంధీ నగర్ ఎయిడెడ్ స్కూల్ కొట్టంబడి స్థలాన్ని కాపాడాలంటూ పూర్వపు విద్యార్థులు డిమాండ్ చేశారు.బడి స్థలానికి అక్రమంగా ఇచ్చిన పట్టాను రద్దు చేయాలని అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. బడి స్థలంలో సచివాలయం, కమ్యూనిటీ హాల్, గ్రంథాలయం నిర్మించాలని స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. పట్టించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


Next Story

Most Viewed