కర్నూల్ జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న కృష్ణమ్మ

by Naga Rani Yarlagadda |

కర్నూల్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా గుడిసే కృష్ణమ్మ బాధ్యతలు చేపట్టనున్నారు.

కర్నూల్ జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న కృష్ణమ్మ
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూల్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా గుడిసే కృష్ణమ్మ బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఆమె జిల్లా పార్టీ కార్యాలయంలో బాధ్యతలు చేపడతారని పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. తొలుత పార్టీ నాయకులతో కలిసి కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం జిల్లా టీడీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని టీడీపీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని తిక్కారెడ్డి కోరారు.

Next Story