- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > కర్నూలు > రాయితీపై బిందు సేద్యం పరికరాలు.. ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ
రాయితీపై బిందు సేద్యం పరికరాలు.. ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ
by Dishafeatures2 |
X
దిశ, నంద్యాల : రాయితీపై బిందు, తుంపర సేద్యం పరికరాలు అందజేయనున్నట్లు ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 2023-24 సంవత్సరానికి గాను 5 వేల హెక్టర్లను లక్ష్యంగా కేటాయించామని, అవసరమైన ప్రతి రైతుకు కూడా రాయితీపై ఈ పరికరాలు అందచేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో వారి పేర్లను నమోదు చేసుకోవాలని, ఐదెరాల్లోపు ఉంటే 90 శాతం రాయితీ, ఐదెకరాలపైన ఉన్న రైతులకు 70 శాతం రాయతీపై బిందు సేద్యం పరికరాలు అందచేయనున్నట్లు తెలిపారు.
స్ప్రింకర్ పరికరాలు ఐదెకరాల్లోపు ఉన్న రైతులకు 55శాతం అంతకంటే పైన వున్న రైతులకు 45 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. జిల్లాకు 11 కంపెనీలను కేటాయించారని, రైతులు వారికి నచ్చిన కంపెనీని ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Next Story