Big Breaking: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి.. కారుకు నిప్పు.. తీవ్ర ఉద్రిక్తత

by Disha Web Desk 16 |
Big Breaking: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి.. కారుకు నిప్పు.. తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో వంశీపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్యే వంశీ వర్గీయులు తీవ్ర ఆగ్రహానికి గురైయ్యారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయం పార్కింగ్‌లో ఉన్న కారుకు నిప్పు పెట్టారు. ఫైరింజన్లు రాకుండా అడ్డుకున్నారు. అంతేకాదు టీడీపీ కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో స్థానికంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ చర్యలతో ఎమ్మెల్యే వంశీపై టీడీపీ నేతలు గరం గరం అవుతున్నారు. గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.



Next Story

Most Viewed