జగన్ ఫోకస్ ఈ అంశంపైనే.. అందుకోసం అసెంబ్లీ సమావేశాల్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్

by Disha Web Desk 22 |
జగన్ ఫోకస్ ఈ అంశంపైనే.. అందుకోసం అసెంబ్లీ సమావేశాల్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు (గురువారం) జరుగబోయే అసెంబ్లీ సమావేశాల్లో జగన్ సర్కార్ ముఖ్యంగా మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉండొచ్చని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉదయం 9గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశాలు ఐదు రోజులు పాటు కొనసాగనున్నాయి. ఈ సమావేశాలలో మొదటి రోజే మూడు రాజధానుల అంశంపై ప్రత్యేక చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోందని సమాచారం. అంతేకాదు.. ఈ అంశంపై సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నట్లు నిఘా వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ సమావేశాలలో మొత్తం 25 అంశాలపై చర్చలు జరిపాలని సర్కార్ నిర్ణయించుకుంది. ఇందులో రెవెన్యూ శాఖ 4 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు గవర్నమెంట్ ఉద్యోగుల విషయంలో కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్.

Also Read : అసెంబ్లీ సమావేశాల వేళ మంత్రుల్లో టెన్షన్.. బాబుకు సవాళ్లు

Also Read : అమరావతి రైతుల పాదయాత్ర... వెల్లువెత్తుతున్న విరాళాలు



Next Story

Most Viewed