Breaking: పిఠాపురంలో భారీ ఓటమి.. ఎగ్జిట్ పోల్‌లో సంచలనం

by Vemula.Srinu Prasad |

పిఠాపురం ఎగ్జిట్ పోల్‌లో ఆ పార్టీ అభ్యర్థికి భారీ ఓటమి తప్పదని తేలింది...

Breaking: పిఠాపురంలో భారీ ఓటమి.. ఎగ్జిట్ పోల్‌లో సంచలనం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే13న ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. అయితే పిఠాపురానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్‌లో వైసీపీ అభ్యర్థి వంగా గీత భారీగా ఓట్ల తేడాతో ఓడిపోతున్నట్లు వెల్లడైంది. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు స్పష్టం చేసింది. ఎంత కొంగు చాచి అడిగినా ఆమెకు మద్దతు ఇవ్వలేదని ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్‌లో తేలినట్లు ఆ సంస్థ నిర్వాకుడు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా పవన్ ఈసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు తెలిపారు.

Next Story