అమానవీయ ఘటన.. మురికి కాలువలో కవల పసికందుల మృతదేహాలు

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది.

అమానవీయ ఘటన.. మురికి కాలువలో కవల పసికందుల మృతదేహాలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని తిరుపతి జిల్లాలో గూడూరు అశోక్ నగర్ సమీపంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. మురికి కాలువలో కవల పసికందుల మృతదేహాలు లభ్యమయ్యాయి. కాలువలో చెత్త తొలగిస్తుండగా పారిశుద్ధ్య సిబ్బందికి పసికందుల మృతదేహాలు కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ విషాద ఘటనను అక్కడే ఉన్న స్థానికులు కూడా చూశారు. దీంతో వెంటనే మురికి కాలువలో కవల పసికందుల మృతదేహాలపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story