పవన్‌ కల్యాణ్‌తో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ భేటీ

by Muthe.Rajitha |

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో తెలంగాణ హైడ్రా కమిషన్ కమిషనర్ ఏవీ రంగనాథ్ సమావేశం అయ్యారు.

పవన్‌ కల్యాణ్‌తో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో తెలంగాణ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమావేశం అయ్యారు. మంగళగిరిలోని జనసేన క్యాంపు ఆఫీసులో వీరు ఇరువురు భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలపాటు వీరిద్దరి మధ్య సుదీర్ఘ సమావేశం జరిగింది. కాగా.. విజయవాడలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరైన రంగనాథ్.. మర్యాదపూర్వకంగా పవన్ కళ్యాణ్ ను కలిసినట్టు సమాచారం. అయితే వీరి చర్చల సారాంశం మాత్రం బయటికి రాలేదు.

Next Story