Breaking: అమెరికాలో బాపట్ల జిల్లా వాసి మృతి

by Disha Web Desk 16 |
Breaking: అమెరికాలో బాపట్ల జిల్లా వాసి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లాకు చెందిన పొట్టి రాజేశ్ కుమార్ అమెరికాలో మృతి చెందారు. ఉద్యోగరీత్యా ఫ్లోరిడా బ్రిడ్స్ వాటర్ కమ్యూనిటీలో రాజేశ్ నివాసముంటున్నారు. రాజేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబంతో కలిసి జాక్సన్ విల్ విట్లర్ బీచ్‌కు విహార యాత్రకు వెళ్లారు. అయితే సముద్రంలో స్నానంగా చేస్తుండగా అలల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. దీంతో సముద్రంలో కొట్టుకు పోతున్న ఇద్దరు పిల్లలను కాపాడారు. అయితే రాజేశ్ మాత్రం సముద్రపు అలల్లో కొట్టుకుపోయారు.

దీంతో మెరైన సిబ్బంది సముద్రంలో గాలించి రాజేశ్ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. రాజేశ్ మృతి విషయం తెలియడంతో స్వగ్రామంలో విషాదచాయలు అలుముకున్నారు. రాజేశ్ మృతి పట్ల అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సంతాపం తెలిపారు. రాజేశ్ కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు. రాజేశ్ మృతదేహాన్ని స్వదేశం తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని తానా ప్రతినిధులను కోరారు.

Next Story

Most Viewed