- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉండవల్లిలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం.. అధికారులకు మంత్రి నారాయణ కీలక ఆదేశాలు
ఉండవల్లి స్టీల్ బ్రిడ్జ్ పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాజధాని ప్రాంతంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో నిర్మిస్తున్న ఉండవల్లి స్టీల్ బ్రిడ్జ్ పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీడ్ యాక్సిస్ రోడ్డును పాత గుంటూరు హైవేతో అనుసంధానించే ఈ ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఆయన పేర్కొన్నారు.
నిర్మాణ పురోగతిపై సమీక్ష
బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి, సాంకేతిక అంశాలపై ఇంజనీర్లతో చర్చించారు. ముఖ్యంగా కాంక్రీట్ పిల్లర్లపై స్టీల్ గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. మొత్తం 88 గడ్డర్లకు గానూ 20 గడ్డర్లు పూర్తయ్యాయని ఇంజినీర్లు తెలిపారు. మిగిలిన గడ్డర్ల తయారీ, ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
త్వరగా అందుబాటులోకి..
అమరావతికి వచ్చే ప్రయాణికులకు ఈ బ్రిడ్జ్ ఎంతో కీలకమని, ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. పనుల్లో జాప్యం లేకుండా, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ వీలైనంత త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు.






