CM Jagan: పుల్లంపేట ప్రమాద బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

by Disha Web Desk 16 |
CM Jagan: పుల్లంపేట ప్రమాద బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: పుల్లంపేట ప్రమాద బాధితులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిహారం ప్రకటించారు. మృతులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ. 50 వేలు చొప్పున సాయం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ఈ పరిహారం త్వరలోనే అందించనున్నారు.

కాగా అన్నమయ్య జిల్లా పుల్లంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందర్నీ రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తలించారు. ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి కడప వెళ్తుండగా ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. మృతుల వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఘటనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed