Breaking: పల్నాడు జిల్లాలో ఆటో బోల్తా.. 11 మందికి గాయాలు

by Disha Web Desk 16 |
Breaking: పల్నాడు జిల్లాలో ఆటో బోల్తా.. 11 మందికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నడికుడి వంతెన వద్ద అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయి. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరికి నరసరావుపేట ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్వల్పగాయాలైన ఆరుగురిని గురజాల ప్రభుత్వానికి తరలించారు. ఆటో దాచేపల్లి నుంచి గురజాల వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని... అతివేగం అసలు పనికి రాదన్నారు. కచ్చితంగా రోడ్డు సేఫ్టీ రూల్స్ పాటించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నా రోడ్డు ప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed