Ap News: ఈ నెలలోనే పెండింగ్ డీఏలు.. మేలో ఉద్యోగుల బదిలీలు

by Disha Web Desk 16 |
Ap News: ఈ నెలలోనే పెండింగ్ డీఏలు.. మేలో ఉద్యోగుల బదిలీలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్ళినట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి వెల్లడించారు. పెండింగ్ డీఏలు విడుదల చేయాలని కోరగా ఈ నెలలో డీఏ ఉత్తర్వులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఉద్యోగుల సాధారణ బదిలీలకు అనుమతించాలని కోరగా మే నెలలో ఉద్యోగుల బదిలీలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారులను ఆదేశించారని స్పష్టం చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా ఈ బదిలీలలో అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన సీఎం జగన్‌కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Next Story

Most Viewed