Ap News: విశాఖ కిడ్నాప్ ఘటనపై డీజీపీ ఏమన్నారంటే...

by Disha Web Desk 16 |
Ap News: విశాఖ కిడ్నాప్ ఘటనపై డీజీపీ ఏమన్నారంటే...
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటనపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారు. డబ్బుల కోసమే వారిని కిడ్నాప్ చేశారని ఆయన వివరించారు. అయితే గంటల్లోనే ఆ కిడ్నాప్ కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశామని డీజీపీ తెలిపారు. కిడ్నాపర్లు హేమంత్, రాజేశ్, సాయిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మరో నలుగురి కోసం పోలీసు గాలిస్తున్నట్లు చెప్పారు. పట్టుబడిన నిందితుల నుంచి రూ. 85 లక్షలు రికవరీ చేసినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగానే ఉందన్నారు. క్రైమ్ రేటు కూడా అదుపులోనే ఉందని తెలిపారు. పోలీసులు అప్రమత్తంగా ఉండటం వల్లే కేసును త్వరగా ఛేదించారని డీజీపీ పేర్కొన్నారు. గంజాయి ఉక్కుపాదం మోపామని... గతంలో కూడా ఈ స్థాయిలో నియంత్రించలేదని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story

Most Viewed