ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-08 17:18:33  IST  )

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి (Tirupati) నుంచి షిరిడీ (Shiridi)కి మధ్య రోజూ రైలు నడపాలని ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ప్రతిపాదనలు పంపారు.

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి (Tirupati) నుంచి షిరిడీ (Shiridi)కి మధ్య రోజూ రైలు నడపాలని ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు ఆయన ప్రతిపాదనకు కేంద్ర ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు నడుస్తున్న టెంపరరీ సర్వీసును ఇక నుంచి రెగ్యులర్‌ చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో తిరుపతి నుంచి షిరిడీ మధ్య నడిచే ట్రైన్ నెంబర్ 07637/07638 సర్వీసు ప్రతి రోజూ అందుబాటులోకి రానుంది. ఈ ట్రైన్ రేణిగుంట, ధర్మవరం, రాయచూర్‌, షోలాపూర్‌, దౌండ్‌ మీదుగా రాకపోకలు సాగించనుంది. కేంద్ర తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story