వైసీపీకి మరో షాక్.. సింగనమల మాజీ ఎమ్మెల్యే రాజీనామా

by Disha Web Desk 16 |
వైసీపీకి మరో షాక్.. సింగనమల మాజీ ఎమ్మెల్యే రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. ఎన్నికల అభ్యర్థుల ప్రకటించిన తర్వాత చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డారు. దీంతో ఆ పార్టీని వీడారు. ఈ రోజు ఉదయం కూడా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇది జరిగిన గంటల్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి షాక్ తగిలింది. ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమల మాజీ ఎమ్మెల్యే యామిని బాల వైసీపీకి గుడ్ బై చెప్పారు. కొద్దికాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తిగా ఆమె తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి త్వరలో భవిష్యత్ కార్యాచరణ చేపడతామని చెప్పారు. అయితే యామిని బాల కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. వైఎస్ షర్మిల సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.



Next Story