రేపు వైఎస్ జగన్ ప్రెస్ మీట్.. కీలక అంశాలపై ప్రశ్నల వర్షం

by Vemula.Srinu Prasad |

ప్రజా సమస్యల పోరాటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దూకుడు పెంచారు....

రేపు వైఎస్ జగన్ ప్రెస్ మీట్.. కీలక అంశాలపై ప్రశ్నల వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజా సమస్యల పోరాటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) దూకుడు పెంచారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు గళం విప్పుతున్నారు. పర్యటనలు, పరామర్శలు కూడా చేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలోని రైతులు, విద్యార్థులు, వివిధ కంపెనీలకు భూముల కేటాయింపు వంటి అంశాలపై ఆయన ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఆయా సమస్యలను స్టడీ చేశారు. ఈ మేరకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన మాట్లాడేందుకు వైసీపీ యంత్రంగా అన్ని ఏర్పాట్లు చేసింది. రైతుల సమస్యలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, వేల కోట్ల విలువైన భూముల కేటాయింపు, సహా అనేక అంశాలకు సంబంధించి ఈ ప్రెస్ మీట్‌లో ప్రభుత్వంపై జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Next Story