ఆర్టీసీ బస్సు ఢీ కొని ఫారెస్ట్ ఆఫీసర్ మృతి

by Disha Web Desk 13 |
ఆర్టీసీ బస్సు ఢీ కొని ఫారెస్ట్ ఆఫీసర్ మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టీసీ బస్సు ఢీ కొని ఫారెస్ట్ ఆఫీసర్ మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తుమ్మల తలుపూరు వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తుమ్మల తలుపూరు ఫారెస్ట్ బీట్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సుధాకర్.. విధి నిర్వహణలో భాగంగా బైక్‌పై వెళ్తుండగా సైదాపురం మండలం తుమ్మలతలుపూరు మలుపు వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో సుధాకర్ తలకు తీవ్ర గాయాలు కావడంతో.. మెరుగైన చికిత్స నిమిత్తం పొదలకూరుకు తరలించారు. అయితే మార్గ మధ్యలో సుధాకర్ మృతి చెందాడు. మృతుడిది నెల్లూరు రూరల్ మండలం చెముడుగుంటగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.


Next Story

Most Viewed