- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala:శ్రీవారి సేవలో సినీ నటుడు రాజేంద్రప్రసాద్
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

దిశ,వెబ్డెస్క్: కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ తరుణంలో తిరుమల కొండకు చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇదిలా ఉంటే.. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికై తిరుమల చేరుకుంటారు.
ఈ తరుణంలో ఇవాళ(ఆదివారం) తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటులు సుమన్, రాజేంద్రప్రసాద్లు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. మొదటగా టీటీడీ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వీరికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.






