Ap Elections 2024:ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థి కుమార్తె!

by Disha Web Desk 18 |
Ap Elections 2024:ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థి కుమార్తె!
X

దిశ,ప్రతినిధి:బుచ్చిరెడ్డిపాలెంలో కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతమ్మకు మద్దతుగా ఎన్నికల ప్రచారం ఆమె కుమార్తె నీలిమ రెడ్డి, కుమారుడు అర్జున్ రెడ్డి నిర్వహించారు.ఈ సందర్భంగా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గెలిస్తే కోవూరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా తీర్చి దిద్దుతారు.అలాగే బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని రాష్ట్రం లో నెంబర్ వన్ గా ఉండే విధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

పట్టణంలోని 16, 17 వార్డుల్లో పార్టీ మండల అధ్యక్షుడు శేషయ్య ఆధ్వర్యంలో దార్ల వైష్ణవి, దశరథ కుమార్, చందన్, దివ్య రెడ్డి, రజినీ రెడ్డి, అశోక్ రెడ్డి, స్నేహలత, శ్రీకాంత్ తదితరులు ప్రచారం చేశారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రశాంతి ఎన్నికైతే ప్రజలకు జరిగే మేలును వివరించారు. కోవూరులో అభివృద్ధి జరగాలంటే సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మరింత మేలు జరుగుతుందని వివరించారు.కార్యక్రమంలో వింజం రామానాయుడు,మహేష్ చోటాబాయి బచ్చా బాయ్, తాళ్ల నరసింహస్వామి, బాలు, బాలాకుమార్, ఉసురు పాటి ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు, భారీగా మహిళలు పాల్గొన్నారు.

Read More..

TDP లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల


Next Story