Ap News: 12న సామర్లకోటకు సీఎం జగన్

by Disha Web Desk 16 |
Ap News: 12న సామర్లకోటకు సీఎం జగన్
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 12న కాకినాడ జిల్లా సామర్లకోటలో పర్యటించనున్నారు. పేదల కోసం నిర్మించిన గృహాలను ఆయన ప్రారంభించనున్నారు. సామర్లకోటలో ఇప్పటికే సీఎం పర్యటించాల్సి ఉంది. కానీ మూడుసార్లు వాయిదా పడింది. అయితే అధికారులు మాత్రం 50 రోజులుగా సామర్లకోటలోనే ఉండి షేర్ వాల్ టెక్నాలజీతో గృహాలను నిర్మిస్తున్నారు. ఈ నెల 12న సీఎం జగన్ సామూహిక గృహ ప్రవేశాలు చేపడతారు. అనంతరం ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్‌లో ప్రసంగిస్తారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టించారు. సీఎం జగన్ సామర్లకోట వచ్చి తిరిగి వెళ్లే వరకూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.



Next Story