Kakinada: కన్నకూతురుపై తండ్రి ఘోరం

by Disha Web Desk 16 |
Kakinada: కన్నకూతురుపై తండ్రి ఘోరం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురుపాలిట కామాంధుడిగా మారాడు. కన్నకూతురు పట్ల మృగంలా ప్రవర్తించాడు. ఇంట్లో భార్య లేని సమయంలో కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కాకినాడ దుమ్ములపేటలో జరిగింది. రాము(40), జయమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్యానికి బానిసైన రాము(40)కుటుంబ పోషణ కోసం ఎలాంటి పనులు చేయకుండా ఇంటి వద్దే ఉంటున్నారు. అయితే ఆర్థికభారంతో కుమార్తెలు ఇద్దరినీ తల్లి ఇంటి వద్ద ఉంచి ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు.

అయితే వేసవి సెలవులు కావడంతో పిల్లలు దుమ్ములపేట వద్దకు వెళ్లారు. ఇంట్లో కుమార్తెలను వదిలేసి జయమ్మ చేపలు అమ్మేందుకు వెళ్లారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రాము పెద్ద కుమార్తెపై కన్నేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించారు. అలాగే రాత్రి సమయంలో భార్యను బయటకు పంపి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. జయమ్మ ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన ఘోరాన్ని తల్లికి చెప్పుకుని కుమార్తె బోరున విలపించారు.

దీంతో భార్య జయమ్మ, భర్త రామును నిలదీశారు. ఈ విషయాన్ని బయటకు చెపితే చంపేస్తానని బెదిరించి ఇంటిలో ఉన్న వస్తువులు, బట్టలను కాల్చివేశారు. దీంతో భయబ్రాంతులకు గురైన ఆమె కూతురిని తీసుకుని కాకినాడ పోర్టు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన డీఎస్పీ మురళీ మోహన్‌ విచారణ చేపట్టారు. బాలికను ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.



Next Story

Most Viewed