టీడీపీ తోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం: రెడ్డి సుబ్రహ్మణ్యం

by Disha Web Desk 18 |
టీడీపీ తోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం: రెడ్డి సుబ్రహ్మణ్యం
X

దిశ ప్రతినిధి,అమలాపురం:పేదల కోసం అనేక పథకాలు మౌలిక సదుపాయాలు తీసుకువచ్చి వారి అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు.జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి ఆధ్వర్యంలో 42 వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆమె స్వగృహం నందు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అన్నారు.

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును సీఎం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక పార్లమెంట్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించడానికి ప్రతి నాయకులు,కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు తాడి నరసింహారావు, ట్రెజరర్ ఎస్.సత్తిబాబు రాజు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పి.నారాయణరావు బాలు, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి యాళ్ళ ఉదయ్, దాట్ల బాబు, త్సామా బాబు,సలాది బాబూరావు, సలాది పుల్లయ్య నాయుడు, కుడుపూడి బుజ్జి,పెండ్రరమేష్,ఆరుమిల్లి సాయిబాబు,చొల్లంగి సత్తిబాబు,జాలెం సుబ్బారావు, పెచ్చెట్టి చిన్నారావు,గన్నవరం రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More..

ఎన్నికల వేళ అభ్యర్థులకు గండం.. ఇందులో వెనుకపడితే సీటు గల్లంతేనా?


Next Story

Most Viewed