- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anakapally Incident : అనకాపల్లి ప్రమాదంలో 8కి చేరిన మృతులు... విచారణకు ఆదేశించిన కలెక్టర్
ఏపీ(AP)లోని అనకాపల్లి బాణాసంచా పేలుడు(Anakapally Incident) ఘటనలో మృతుల సంఖ్య 8 కి చేరింది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లోని అనకాపల్లి బాణాసంచా పేలుడు(Anakapally Incident) ఘటనలో మృతుల సంఖ్య 8 కి చేరింది. అనకాపల్లి జిల్లా(Anakapally) కోటవురట్ల మండలంలోని కైలాసపట్నంలో ఓ బాణాసంచా తయారీ కేంద్రం(Fireworks manufacturing Unit)లో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో స్పాట్ లోనే ఐదుగురు చనిపోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. కాగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు విశాఖ కేజీహెచ్ వైద్యులు తెలిపారు. కాగా ఈ ప్రమాదంపై కలెక్టర్ విజయకృష్ణన్ విచారణకు ఆదేశించారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 15 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు, వీరంతా సామర్లకోటకు చెందిన వారుగా అధికారులు తెలిపారు. కాగా ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు హోంమంత్రి అనితకు ఫోన్ చేసి, ప్రమాద వివరాలు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.






