మళ్లీ అధికారంలోకి వచ్చాక తొలి సంతకం దానిపైనే చేస్తా.. CM జగన్ కీలక ప్రకటన

by Disha Web Desk 2 |
మళ్లీ అధికారంలోకి వచ్చాక తొలి సంతకం దానిపైనే చేస్తా.. CM జగన్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర గురువారం తిరుపతి జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు వృద్ధుల సంక్షేమాన్ని విస్మరించారని, ఆయన వల్లనే పింఛన్ల కోసం ఎండలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్ ఇచ్చే పరిస్థితిని చూసి చంద్రబాబు కళ్లు మండాయని.. అందుకే వృద్ధులను ఎండకు నిల్చోబెట్టే పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఐదేళ్లుగా ప్రతి నెలా 1వ తేదీనే పింఛన్ అందించామని తెలిపారు. దీనిని జీర్ణించుకోలేక, అసూయతో పింఛన్‌లు అడ్డుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. వ్యూహాత్మకంగా నిమ్మగడ్డ రమేష్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించారని అన్నారు.

రాజకీయాలు చెడిపోయాయి, దిగజారిపోయాయని ఆవేదన చెందారు. తాము చెబితేనే పింఛన్‌లు ఆగిపోయాయని.. టీడీపీ అభ్యర్థులు నిస్సిగ్గుగా చెప్పడం దారుణమన్నారు. పింఛన్ కోసం వెళ్లి ఎండ తీవ్రత తట్టుకోలేక 31 మంది వృద్ధులు ప్రాణాలు విడిచారని అన్నారు. ఈ 31 మందిని చంపిన హంతకుడు చంద్రబాబే అని మండిపడ్డారు. ఎవరూ ఆందోళన చెందవద్దని.. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని ఓపిక పట్టండి అని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే చేస్తానని హామీ ఇచ్చారు. మళ్లీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని కీలక ప్రకటన చేశారు.



Next Story

Most Viewed