ఢిల్లీ కేంద్రంగా మారిన ఏపీ రాజకీయాలు.. రేపు ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ

by Disha Web Desk 12 |
ఢిల్లీ కేంద్రంగా మారిన ఏపీ రాజకీయాలు.. రేపు ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీ రాజకీయాలు ఢిల్లీ వేదికగా మారిపోయాయి. బీజేపీతో పొత్తుల విషయంలో ఇప్పటికే ఒకసారి పవన్ కల్యాణ్ అమిత్ షాతో భేటీ కాగా నిన్న చంద్రబాబు నాయుడు కూడా షాతో భేటీ అయ్యి పొత్తులపై చర్చించారు. ఈ రోజు హైదరాబాద్ వచ్చాక మరోసారి పవన్ కల్యాణ్ నివాసంలో చంద్రబాబు భేటీ కానున్నారు.

ఇదిలా ఉంటే.. ఈరోజు రాత్రి ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అలాగే రేపు ఉదయం ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశం ఉందని.. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. కానీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఏపీ ప్రధాన పార్టీ లీడర్స్ అందరూ.. బీజేపీతో వరుస సమావేశాలు నిర్వహించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది.



Next Story

Most Viewed