నెల్లూరు రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం.. సీఎం కీలక ఆదేశాలు

by Naga Rani Yarlagadda |

తాజాగా ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

నెల్లూరు రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం.. సీఎం కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కారును రాంగ్ రూటులో వచ్చిన టిప్పర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సహా మంత్రులు దిగ్భ్రాంతి చెందారు. తాజాగా ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాగా.. ప్రమాదానికి గురైన కారు నుజ్జునుజ్జవ్వగా.. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉండటం అందరినీ కలచివేసింది.

Next Story