Tirumala: రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న ప్రముఖులు..

by Disha Web Desk 3 |
Tirumala: రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న ప్రముఖులు..
X

దిశ వెబ్ డెస్క్: కలియుగ దైవంగా, ఆపదమొక్కుల వాడుగా పేరుగాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి దేశం నలుమూలల్లో భక్తులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక ప్రతి రోజు లక్షల మంది భక్తులు స్వామీ వారి దర్శనానికి వస్తుంటారు. అయితే ఆ స్వామి వారిని చూడడానికి వచ్చిన భక్తులు గంటల కొద్దీ కంపార్టుమెంట్లలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

తాజాగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులు కి 10 గంటల సమయం గడుస్తున్నా కంపార్టుమెంట్లలో ఉంది ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఇక ఒకటో రెండో కంపార్ట్మెంట్లు కాదు దాదాపు 15 కంపార్టుమెంట్లలో ఇదే పరిస్థితి. గంటలు గడుస్తున్నా స్వామి దర్శనానికి భక్తులు వేచి చూడాల్సి వస్తోంది. ఇక రేపు ఉదయం శ్రీవారిని సీజేఐ చంద్రచూడ్ దర్శించుకోనున్నారు.ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రికి సీజేఐ చంద్రచూడ్ దంపతులు తిరుమల చేరుకోనున్నారు. ఇక వారు శ్రీరచనా అతిధి గృహంలో రాత్రికి బస చేస్తారు.



Next Story

Most Viewed