వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు సీఐడీ నోటీసులు

by Muthe.Rajitha |

మరో వైసీపీ(YSRCP) మాజీ ఎమ్మెల్యేకు పోలీసుల నుంచి నోటీసులు అందాయి.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు సీఐడీ నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : మరో వైసీపీ(YSRCP) మాజీ ఎమ్మెల్యేకు పోలీసుల నుంచి నోటీసులు అందాయి. గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కిలారి వెంకట రోశయ్య(Kilari Venkata Rosaiah)కు సీఐడీ(CID) నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో రేషన్ మాఫియా చేతిలో హత్యకు గురైన బర్నబాసు కేసు విచారంలో భాగంగా ఈ నోటీసులు జారీ అయ్యాయి. మంగళవారం విచారణకు రావాలని సీఐడీ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే రోశయ్య మాత్రం తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, నోటీసులు అందిన తర్వాత స్పందిస్తానని మీడియాకు వెల్లడించారు.

Next Story