Tirumala: నిజాయితీ చాటుకున్న టీటీడీ ఉద్యోగులు

by Disha Web Desk 16 |
Tirumala: నిజాయితీ చాటుకున్న టీటీడీ ఉద్యోగులు
X

దిశ, తిరుపతి: తిరుమలలో టీటీడీ ఉద్యోగులు నిజాయితీ చాటుకున్నారు. భక్తులు పొరపాటున వదిలి వెళ్లిపోయిన బంగారు ఆభరణాన్ని తిరిగి అప్పగించి ప్రశంసలు అందుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన భక్తులు విష్ణుపాదం గృహంలో గదిని అద్దెకు తీసుకున్నారు. శ్రీవారి దర్శనం ముగించుకుని వెళ్లిపోయారు. గదిని శుభ్రపరిచేందుకు వెళ్లిన పారిశుధ్య కార్మికులు రూ.2 లక్ష విలువైన బంగారు మంగళ సూత్రాన్ని గుర్తించారు. టీటీడీ ఓఎస్డీ రామకృష్ణకి సమాచారం ఇచ్చారు. దీంతో ఫోన్​ నెంబర్‌ ఆదారంగా వారికి సమాచారం అందించారు. చివరికి భక్తులు తిరిగి తిరుమల చేరుకున్నారు. వారికి అధికారులు ఆభరణాన్ని అప్పగించారు. టీటీడీ సిబ్బంది నిజాయితీని కొనియాడిన భక్తులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.


Next Story

Most Viewed