- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Tirumala: కొనసాగుతున్న శ్రీవారి కానుకల లెక్కింపు
దిశ, తిరుపతి: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను నూతన పరకామణి భవనంలో లెక్కించడం కొనసాగుతోందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో నూతన పరకామణి భవనంలో ఈవో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెంగుళూరుకు చెందిన దాత మురళీకృష్ణ సహకారంతో నూతన పరకామణి భవనాన్ని అత్యాధునిక భద్రతతో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఏడాది సెప్టెంబర్ 28న సీఎం జగన్మోహన్ రెడ్డి నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించినట్లు ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఇందులో సీసీ కెమెరాలు, ఇతర మౌలిక వసతులు కల్పన పూర్తయినందున కానుకలను లెక్కించడం జరుగుతుందని ధర్మారెడ్డి పేర్కొన్నారు.
తిరుమల పెద్ద జీయర్ స్వామి వారి ఆశీస్సులతో శ్రీవారి ఆలయం నుంచి 12 హుండీలు చిన్న లిఫ్ట్ సహాయంతో లారీలో తరలించినట్లు ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. ఇకపై ప్రతిరోజు అన్ని హుండీలు నూతన పరకామణి భవనానికి చేరుకుంటాయన్నారు. నెల రోజుల తరువాత ఆలయంలోని పరకామణి మండపాన్ని భక్తులు కూర్చునేందుకు అనువుగా తీర్చిదిద్దనున్నట్లు ఈవో వివరించారు
READ MORE