తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే.?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-13 02:25:58  IST  )

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది..

తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే.?
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో భారీగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌(Vaikuntam Q Complex)లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వెలుపల క్యూ లైన్‌లోనూ భక్తులు వేచిఉన్నారు. తాజాగా శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,609 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,144 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ(Srivari Hundi) ఆదాయం కూడా భారీగా పెరిగింది. నిన్న ఒక్కరోజే రూ. 4.11 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఒక భక్తుల రద్దీని బట్టి సమయాలు మారుతాయని తెలిపారు.

Next Story